మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహయం

   విశాఖపట్నం ( జనస్వరం ) : కులమతాలకతీతం ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. స్థానిక 33వ వార్డు కుమ్మరవీధిలో మృతి చెందిన ఎం.డి.నసీమా బేగం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసారు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. రాజకీయాలకు, కులమతాలకతీతంగా తన సేవలు కొనసాగుతాయని చెప్పారు.ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ముందుడి వారికి అండగా ఉంటానని తెలిపారు. ఎవరు ఎటువంటి అధైర్య పడనవసరం లేదని మీ సోదరుడిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కార సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను కోనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏ. శ్రీనివాసరావు, టమాటా అప్పారావు, కే.రాజేశ్వరి, జయ, టబు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way