Search
Close this search box.
Search
Close this search box.

షార్ట్ సర్క్యూట్ బాధితులకు డాక్టర్ కందుల నాగరాజు చేయూత

కందుల నాగరాజు

          విశాఖపట్నం ( జనస్వరం ) : జీవీఎంసీ 41 వ వార్డు జ్ఞానాపురంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు ఇళ్లల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలక్ట్రికల్ వస్తువులు ఇతర సామాన్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన మరియా, జ్యోతి కుటుంబాలకు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు అందజేశారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి వారికి అండగా నిలిచారు. అలాగే అదే వార్డులో పుష్పవతి అయిన లలిత అనే అమ్మాయికి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఒక మంచి లక్ష్యంతో కొనసాగిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 70వ రోజుకు చేరుకుందని చెప్పారు. ఈ 70 రోజులలో దక్షిణ నియోజకవర్గంలోని సుమారుగా అన్ని వార్డులలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంతోమందికి తన పరిధి మేరకు సహాయం చేసినట్లు చెప్పారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చిన తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు, వీర మహిళలు అంతొనీ, అనిల్, రామారావు, అప్పారావు, శ్రీను, సూరి, మనోహర్, మని, లలిత, జానకి, మంగ, రాజేశ్వరి, సునీత, దుర్గ, కుమారి, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way