Logo
Date of Publish : 18 October 2023, 10:24 pm
Editor : Sake Naresh

ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్న డాక్టర్ కందుల నాగరాజు

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 96వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేరుగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకుంటున్నారు. వారికి సహాయం చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా నేరుగా వారి కుటుంబ సభ్యులకు సహాయం చేసి తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఏనాడు కూడా గర్వానికి పోకుండా సాటి మనిషికి సహాయం చేయాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకుల సమన్వయంతో కలిసి నియోజకవర్గంలో పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా 32 వ వార్డు భీమ్ నగర్ లో ఉన్న పెళ్లి కుమార్తె నీలిమకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర జాకెట్ , పసుపు కుంకుమ అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సిహెచ్.శ్రావణి , వి ఏ నాయుడు, మంగ, దుర్గ, కుమారి, పావని, మంజు గౌరీ, మణి, రమణ, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ . వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com