అనంతపురం, జూలై 6 (జనస్వరం): ప్రముఖ జియాలజిస్టు, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మాజీ అతిథి అధ్యాపకులు డాక్టర్ బండి నారాయణ స్వామికి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ), తిరుపతి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) డిగ్రీని ప్రదానం చేసింది. "రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ అప్లికేషన్స్ ఇన్ ఎవాల్యూషన్ ఆఫ్ డోలమైట్ రిసోర్సెస్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా" అనే అంశంపై ఆయన నిర్వహించిన పరిశోధనకు గాను జియాలజీ విభాగం నుంచి పీహెచ్డీ డిగ్రీకి అర్హులని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఎస్వీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి. రాజమాణిక్యం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బండి నారాయణ స్వామి గతంలో అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో దశాబ్ద కాలం పాటు జియాలజీ విభాగంలో అతిథి అధ్యాపకుడిగా సేవలందించారు. ఆయనకు డాక్టరేట్ లభించిన సందర్భంగా స్నేహితులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.