Search
Close this search box.
Search
Close this search box.

జగన్మోహనరెడ్డి గారి పాలనలో దివ్యాంగులు, మహిళలపైన దాడులు, హత్యాచారాలు : గోగన ఆదిశేషు

దివ్యాంగులు

                బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయం లో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఈ నెల 15 వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మూగ, చెముడు దివ్యాంగురాలిపైన  పైన, తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం 2 గంటలకు దివ్యాంగురాలు పైన హత్యాచారం మరియు దాడి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గానీ, హోం మంత్రి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్, మహిళ ఛైర్పర్సన్ గానీ ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదు. దివ్యాంగులంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిన్న చూపు చూపుతోందని అన్నారు. కేవలం ఓట్ల సమయంలో మాత్రమే దివ్యాంగులకు చేరువైతారు. ఇప్పటికైనా వెంటనే దివ్యాంగురాలు పైన జరిగిన సంఘటనపై స్పందించి తగిన న్యాయం చేయాలని జనసేన పార్టీ నుండి దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో  కోకి రాజశేఖర రెడ్డి, గంటా నాగ మల్లేశ్వరరావు, దేవిరెడ్డీ శ్రీనివాసరావు, దంది ప్రోలు వీర్రాజు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way