చంద్రగిరి నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు

    చంద్రగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరదబాధితుల సహాయార్థం జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పంపిన నిత్యావసర సరుకుల కిట్లను చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, శ్రీ దేవర మనోహర గారి నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలోని, తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు పంచాయతీలోని ముళ్ళపూడి గ్రామంలోని రామకృష్ణారెడ్డి నగర్ లో దాదాపు 40 ఇండ్లు నీటిమయం అయ్యాయి, వరద బాధితుల సహాయార్థం అందుబాటులో ఉన్న 20 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అలానే నష్టపోయిన ప్రజలను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెల్లుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి గారు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధు గారు, లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కంచి శ్యామల గారు, నారాయణ గారు, పార్ధు, రవిప్రకాష్, కిరణ్, ధనుష్, ప్రతాప్, గౌతమ్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.