Search
Close this search box.
Search
Close this search box.

పెనుకొండ నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో జిల్లా అధ్యక్షులు ఆత్మీయ సమావేశం

   పెనుకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నాయకులు, జనసైనికులు ఆధ్వర్యంలో గ్లోబుల్ ట్రస్ట్ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి నాయకులకు, జనసైనికులకు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని దిశానిర్దేశం చెయ్యడం జరిగింది. అలాగే మార్చి 14వ తేదీ ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా నుండి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నియోజకవర్గ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు మండల అధ్యక్షులు, నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way