పొదిలిలో జనసేనపార్టీ సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పొదిలి

          పొదిలి ( జనస్వరం ) : పొదిలి పట్టణం మూడవ వార్డు కాటువారిపాలెం నందు జనసేనపార్టీ నాయకులు సోము వెంకట్రావు మరియు జనసేన పొదిలి మండలం అధ్యక్షులు పెరిసోముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు జోరు వర్షానికి లెక్కచేకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ శైలజ, క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way