Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ నాయుకులు కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లుకు యూనిఫారంపంపిణీ

జనసేన పార్టీ

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయుకులు కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లుకు యూనిఫారం పంపిణి చేశారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు వద్ద నున్న కందుల నాగరాజు నివాసంలో జరిగిన కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా శివ శంకర్ మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్బంగా 500 మందికి యూనిఫామ్ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. దేశానికి అహింసా, గాంధీ ఈ దేశానికి అహింసా, సత్యాగ్రహ, శాసన ఉల్లాంఘన, సహాయ నిరాకరణ ఆయుధాలను దేశానికి అందించారన్నారు. ఈ ఆయుధాలతో ఏ దురాగతాన్ని ఎదుర్కో వచ్చున్నన్నారు. జనసేన కు పట్టం కట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నరన్నారు వారహి లో పవన్ కళ్యాణ్ సందించిన ప్రశ్నలకు వైసిపీ నేతలు సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలపణలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం జనసేన ద్యేయం అన్నారు. జనసేన నాయుకులు కందుల నాగరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కో తున్నారని చెప్పారు. వైసిపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లును నిలువు దోపిడీ చేస్తుందన్నారు. రాష్ట్ర దిశ,దశ మారాలంటే అది జనసేనతోనే సాధ్యం అన్నారు. జనసేన కార్యకర్తలకు 5 లక్షలు బీమా చేసిన పార్టీ జనసేన అని వివరించారు.సొంత నిధులతో సంక్షేమం చేసే ఏకైక నేత పవన్ కళ్యాణ్ అని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు శివప్రసాద్ రెడ్డి, కందుల బద్రి, కందుల కేదార్, గరికిన రవి, తెలుగు అర్జున్, తెలుగు లక్ష్మి, శ్రావణి, రఘు, త్రినాధ్, నరేష్, లుక్స్ గణేష్, దుర్గా, కుమారి, జానకి, శర్వాణి , రూపా, నరేంద్ర, అంగటి త్రినాద్, అప్పారావు, లలిత, ప్రణిత, అనిల్, భూలక్ష్మి గాజుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way