గుడివాడ, (జనస్వరం) : కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు జనసేన నాయకులు శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ కిట్లును క్రియశీలక సభ్యులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వము, తన వ్యక్తిగత సంపాదన నుంచి కార్యకర్తల శ్రేయస్సు నిమిత్తం కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అని అన్నారు. ఈ సభ్యత్వంతో పాటు సభ్యులకు ఇచ్చిన భీమాసౌకర్యంతో ప్రమాదం జరినపుడు, వైద్యం నిమిత్తం రూ50000లు ప్రాణహాని జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు రూ 500000 ఇస్తూ పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామని, దేశంలో మరే రాజకీయ పార్టీల్లో లేని సౌకర్యం జనసేన పార్టీ కలగజేసింది. రానున్న రోజుల్లో అన్నీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి బలమైన కమిటీలు ఏర్పరుచుకొని, కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలను సైతంలెక్క చేయక పన్నులతో బాదుతూ పీడిస్తున్న ప్రభుత్వంతో పోరాటానికి సామాన్యుడికి అండగా నిలుస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర రావు, సందు పవన్, ఆర్.కె, కందికొండ దుర్గా శ్రీను, వడ్డది లక్ష్మీ కాంత్, ఇంటూరి గజేంద్ర, కాట్రగడ్డ అరవింద్, సాయి పవన్, శ్రీను,అయ్యప్ప, జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.
