Search
Close this search box.
Search
Close this search box.

క్రిస్మస్ సందర్భంగా పిఠాపురంలో నిత్యావసర సరుకులు పంపిణీ

   పిఠాపురం ( జనస్వరం ) :  నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్ ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి దళిత  కాలనీలో జనసేన పార్టీ తరఫున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.  పిఎస్ఎన్ మూర్తి టీంమహిళలకు క్రిస్మస్ కానుకగా బియ్యం, కూరగాయలు ఇవ్వడం జరిగింది. జనసేన తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్న పీఎస్ఎన్ మూర్తి టీమ్ ను అభినందించారు.  పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనసేన తెలుగుదేశం ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నామని పీ ఎస్ఎన్ మూర్తి తెలియజేశారు. జనసేన తెలుగుదేశం కూటమితో పిఠాపురం నియోజకవర్గం అత్యంత మెజారిటీతో విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వడ్డి రాజు గార శీలం, ఏసుబాబు, జనసేన నాయకుల నల్లి అప్పాజీ, నల్లి చిన్నబాబు, నల్లి నాగార్జున, వడ్డి మున్నా (జనసేన యూత్), పెండి శ్రీనివాస్, పెంకె జగదీష్ కోల దుర్గాదేవి, పబ్బిరెడ్డి ప్రసాద్, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, నామ శ్రీకాంత్, మరియు పి.ఎస్.ఎన్ మూర్తి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way