జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

          జనసేనపార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం, జనసేన ఆల్ టీం ఆధ్వర్యంలో పార్టీ సిద్ధాంతాలలో ఒకటి అయిన “పర్యావరణన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం” ఆధారంగా వినాయక చవితి సందర్బంగా మట్టి ప్రతిమలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగ నాయకులు షరీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపి, విజయ్, బబ్లు, JSP ALL నియోజకవర్గం TEAM, జనసేన పార్టీ విద్యార్థి విభాగ టీం, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.