జనసైనికులచే నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ – సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న జనసైనికులు

                          ఒకవైపు పక్కా గృహాలులేక మరోవైపు చలిపులికి తట్టుకోలేక గజగజ వణుకుతూ.. అల్లాడుతూ దుర్భరమైనజీవితం గడుపుతున్న నిరుపేదల పట్ల గొప్ప మానవతా హృదయాలతో స్పందించిన జనసైనికులు దుప్పట్లు పంపిణీ చేసి తమ మానవత్వం చాటుకున్నారు. జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఎందరో యువతీ, యువకులు చాలా మంది జన సైనికులుగా మారి నిరంతరం జనసేవలో తరిస్తున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో మేముసైతం అంటూ ముందుంటూ అభాగ్యులపాలిట ఆపద్భాంధవులై ఆపన్నహస్తం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా, మార్గదర్శకులుగా విశేష సేవలందిస్తున్నారు. ఆదివారం జనసేనపార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ ముద్దినేని వెంకటరమణ ఆధ్వర్యంలో శాంతిపురంలో పక్కాగృహాలులేక దయనీయంగా బతుకులు వెళ్ళదీస్తున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తిరుపతి జనసైనికులు అఖిల్, సర్మిస్తా, లావణ్య, తేజశ్రీ, మునిశంకర్, ప్రవీణ్, మణిదీప్, జీవన్ తదితరులకు మువెర, రామమూర్తి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు రమేశ్ గారు, నవీన్ గారు మరియు మండల అధ్యక్షులు రఘుపతి, ప్రధానకార్యదర్శి వేణు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way