సూర్యాపేటలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

     సూర్యాపేట ( జనస్వరం ) : తెలంగాణ జనసేన పార్టీ ఆదేశాల మేరకు రామగిరి శివ సాయి ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజవర్గం స్థాయి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు పాల్గొనడం జరిగినది. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా జనసేన పార్టీ తన కార్యకర్తలకు 5 లక్షల రూపాయల భీమా ఇస్తుందని అన్నారు. రామగిరి శివసాయి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో 160 మందికి పైగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఉన్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ జనసేన జెండా నియోజకవర్గంలో ఎగురవేసేలా కార్యకర్తలు పని చేయాలని దిశ నిర్దేశించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి కొంతమంది యువత ఆకర్షితులై పార్టీలో చేరికలు జరిగాయి. క్రియాశీలక సభ్యత్వాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ఏవి రావు, చింత నాగార్జున, మోదాల శంకర్ యాదవ్, సుంకర రవి కిషోర్, గుడిసె గౌతమ్ రాజ్, శంకర్ నాయక్, మీసాల మహేష్, సిద్దు సాయి, బెల్లి పవన్, రాజ్ కుమార్, లింగా, శ్రవణ్, రేవంత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way