Search
Close this search box.
Search
Close this search box.

రాచానపల్లి గ్రామ సచివాలయం నందు 51 పెన్షన్స్ పంపిణీ

రాచానపల్లి

         అనంతపురం రూరల్ ( జనస్వరం ) : రాచానపల్లి గ్రామ సచివాలయం నందు కొత్తగా వచ్చినటువంటి 51 పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజి యాదవ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి చొరవతో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు.  ఉపసర్పంచ్ మన్నల వరలక్ష్మి మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి సామాన్యుడికి నవరత్నాలు అందుతున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమం గురించి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎపుడూ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు అందించడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ 2 కోమల గౌస్, సచివాలయం కన్వీనర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way