చిత్తూరు జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో 20 ఆక్సిజన్ సిలిండర్ లు పంపిణీ

చిత్తూరు జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో 20 ఆక్సిజన్ సిలిండర్ లు పంపిణీ

  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వారోత్సవాలలో మొదటి రోజు ఆగష్టు 27 గురువారం ఉదయం 11 గంటలకి తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్ కి సుమారు 20 ఆక్సిజన్ సిలిండర్ కిట్లను అందచేస్తున్నామని జనసేన నాయకులు కార్యక్రమ కో-ఆర్డినేటర్ కంచన శ్రీకాంత్ గారు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భముగా కంచన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఒకే రోజు ఒకే సమయములో ఈ ఆక్సిజన్ సిలిండర్ లు పంపిణీ చేస్తున్నామని, కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న అభాగ్యుల ప్రాణాలని కాపాడే ప్రయత్నమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఈ బృహత్కర కార్యక్రమానికి జనసైనికులంతా శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులలో ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచనకి బీజం వేసిన రవి అనురాజుల(విప్లవ తమిళన్)గారికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగే ఈ కార్యక్రమంకు కో-ఆర్డినేటర్ లు గా కంచన శ్రీకాంత్ మరియు దేవర మనోహర్ వ్యవహరిస్తారని, ముఖ్య అతిధుల సమక్షంలో రుయా సూపరెండెంట్ కి ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సీమీటర్, ఆక్సిజన్ మాస్కులతో వున్న కిట్లని అందిస్తామని తెలిపారు. సిలిండర్ లు డొనేట్ చేసిన దాతలకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా జిల్లా నాయకులని, వీర మహిళలని, జనసైనికులని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way