Search
Close this search box.
Search
Close this search box.

ప్రపంచ కార్మికులు దినోత్సవం సందర్భంగా కార్మికులను సత్కరించి ఉచిత మజ్జిగ పంపిణీ

కార్మికుల

          గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ఎందరో మహానుభావులు కార్మికులు కర్షకులు పోరాటం వారి త్యాగఫలం నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మికులకు భద్రత, కార్మిక చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అప్పుడే కార్మిక దినోత్సవ ఉద్దేశం నెరవేరుతుందన్నారు. గుడివాడ పట్టణ కార్మికులు కరోనా టైంలో ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ఎంతో వర్క్ చేశారని కార్మిక సోదరులందరిని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు అయ్యప్ప, జగదీష్, చరణ్, పవన్, నాగ సాయి, మెకానిక్ మూర్తి, మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way