ఇరగాయి గ్రామంలో శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాలభవనం

   అరకు, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా అరకు వేలి మండలం మారుమూల ఇరగాయి పంచాయితీ ఇరగాయి గ్రామంలో మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, బిమిడి మత్యరాజు  ఇరగాయి గ్రామ పంచాయితీలో పర్యటించడం జరిగింది. ఆ గ్రామస్తులతో సమావేశమైన అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాఠశాల భవనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు పాఠశాలలో కూర్చుని చుదువుకోవడానికి సరైన స్థలం కూడలేదని వర్షాకాలంలో అయితే పూర్తిగా సెలవు ప్రకటించవలిసిందేనని విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తెలిపారు. పంచాయితీలొనే పాఠశాల భవనం ఇలా ఉందంటే మారుమూల గ్రామాల్లో పాఠశాల భవనాలు ఎలా ఉన్నాయో ఈ పాఠశాల చూస్తే తెలుస్తుందని అన్నారు. పిల్లలను బడికి పంపాలంటేనే భయమేస్తోంది అని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఇరగాయి గ్రామంలో ఎప్పుడో నిర్మించిన పాఠశాల భవనం ఇప్పుడు పడిపోయే ప్రమాదంలో ఉంది. పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాఠశాల భవనం పడితే మా పిల్లల పరిస్థితి ఎవరికి చెప్పాలి అంటు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాడు నేడు కింద పాఠశాల భవనం మంజూరు చేయాలని జనసేనపార్టీ తరుపున పిల్లలు, తల్లిదండ్రులుతో కలిసి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుకురు అప్పలరాజు, మధు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way