Search
Close this search box.
Search
Close this search box.

అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని జనసేన నాయకుల ధర్నా

ఇసుక

     వేమూరు ( జనస్వరం ) : కొల్లూరు మండలం, కొల్లూరు కరకట్ట పైన ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని జనసేన పార్టీ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సోమారౌతు అను రాధ మాట్లాడుతూ నెల రోజులుగా అధికారులకి వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకోక పోవటంతో ప్రజల పక్షాన ధర్నా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక తవ్వాకాలని నియంత్రించాలి లేకుంటే తమ ధర్నా కొనసాగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జేపీ వెంచర్ కి ఇచ్చిన లీజూ గడువు ముగిసిన ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారని, ఎవరి ప్రోద్బలం తో జరుగుతుందో ప్రజలకి తెలియాలని కోరుతున్నామని అన్నారు. కొల్లూరు మండల జనసేన అధ్యక్షుల బొందలపాటి చలమయ్య మాట్లాడుతూ కోర్టు సైతం జేపీ పవర్ వెంచర్ ని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చి 18 కోట్లు రూపాయలు జరిమానా కూడా విధించింది.  ఐనా ఈ ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయని అధికారులు తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way