Search
Close this search box.
Search
Close this search box.

CSDT రెగ్యులర్ వారిని నియమించాలని అధికారులకు వినతిపత్రం అందజేసిన ధర్మవరం జనసైనికులు

   ధర్మవరం, (జనస్వరం) : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రైవేటు రైస్ మిల్ లను తనిఖీ చేయకుండా సర్కార్ వారి బియ్యంను అధిక ధరలకు విక్రయిస్తున్న చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఇంఛార్జ్  CSDT గారిని విధుల నుంచి తొలగించాలని జనసైనికులు డిమాండ్ చేశారు. అలాగే ధర్మవరం పట్టణంలోని థియేటర్లు ప్రజలకు వినోదాన్ని పంచే చిత్రాలు అధిక ధరలకు టిక్కెట్లు తినుబండారాలు అమ్ముతున్న, పార్కింగ్ రుసుము అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కావున ఇంఛార్జ్ CSDT విధులు నుంచి తొలగించి రెగ్యులర్ CSDT ని నియమించాలని ఆర్డిఓ కార్యాలయం పరిపాలనాధికారి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISB సాకే హరికుమార్ RSF పిక్కిలి మహేష్  మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way