Search
Close this search box.
Search
Close this search box.

ధర్మారెడ్డి హటావో – టీటీడీ బచావో : తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్

టీటీడీ

      తిరుపతి ( జనస్వరం ) : రాష్ట్రంలో జగన్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాక్షస పాలన కొనసాగిస్తున్నాడని జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకులు రాజా రెడ్డి, రాజేష్ యాదవ్, మునస్వామి, సుమన్, హేమ కుమార్, కిషోర్, సాయి దేవ్ లతోకలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలక ప్రజాప్రతినిధుల లెటర్లను వినియోగించుకుంటూ ధర్మారెడ్డి ఆయన ప్రమేయం లేనట్లుగా, ధర్మపాలన కొనసాగిస్తున్నట్లు నటిస్తూ శ్రీవారి దర్శనాలలో అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తనకు ఫోన్ చేసి ధర్మారెడ్డి టీటీడీలో కొనసాగే ప్రసక్తే లేదని చెప్పారని, ఇలాంటి అధర్మ ధర్మారెడ్డిపై హైకోర్టు కూడా వెళతామన్నారు. టిటిడి ఉద్యోగులు ధర్మారెడ్డికి భయపడాల్సిన అవసరం లేదని, మా పోరాటం అంతా టీటీడీ ఉద్యోగస్తులు, అటవీ కార్మికులు, ఎఫ్ఎంఎస్ కార్మికుల కోసమేనని టిటిడి ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way