అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన దేవర మనోహర్

   చంద్రగిరి ( జనస్వరం ) : చంద్రగిరిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం తెలియజేసింది. వారి న్యాయమైన కోర్కెలు తీర్చాలని ఇన్చార్జి దేవర మనోహర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఒకరోజు నిరాహారదీక్ష కు దిగుతానని హెచ్చరించారు. సిఎం జగన్ కు కుడిభుజం అని చెప్పుకునే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంగన్వాడీల బాధ్యత తీసుకోవాలి. అంగన్వాడీల ప్రతీ సమస్యను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి,  ప్రభుత్వం పై ఒత్తిడి చేసి సాధించుకొనేలా, లేదా సరికొత్త ప్రజా ప్రభుత్వంలో సముచితమైన నిర్ణయం తీసుకొని, చక్కని పరిష్కారం చూపడం జరుగుతుందని హామీ ఇచ్చారు. డిమాండ్లన్నీ ఆమోదియోగ్యమైనవి,అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నాడు పాలాభిషేకం చేసిన చేతులే నేడు పెట్రోల్ క్యాన్లు చేతబట్టాయి. అంగన్వాడీలంటే తల్లితో సమానం, వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీస వేతనం 26 వేలరూపాయలు ఇవ్వాలని, గత ఎన్నికల ముందు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలి.మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలి,మినీ వర్క ర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రూ.10 లక్షల బీమా అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017 టీఏ బిల్లులు, ఇతర బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎఫ్ ఆర్ఎస్ ను రుద్దు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచాలన్నారు. అలాగే ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించాలి. మూడు యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, మండల అధ్యక్షులు సంజీవి హరి, జనసేన నాయకులు యువరాజ్, పార్ధు, రఘు, రమేష్, సంగీతం కిరణ్, నూనె దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way