Search
Close this search box.
Search
Close this search box.

రాయలసీమలో తీరని దాహం, పట్టించుకోని ప్రభుత్వం : దారం అనిత

రాయలసీమ

          మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పత్రికాముఖంగా మాట్లాడుతూ రాయలసీమ కరువు ప్రాంతమని, వేసవికాలంలో మంచినీటి పథకాల నుండి తాగునీటి సరఫరా అవుతున్న వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఫలితంగా దాహం తీర్చుకునేందుకు పట్టణ జనం నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ పథకాలకు ప్రభుత్వం అరకొరగా వ్యయం చేచేసినా ప్రయోజనం లేకపోయింది. చాలా ప్రాంతాల్లో పైపులైన్లు బాగా దెబ్బ తిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువ లోనే పైపులైన్లు ఉన్నాయి. దీంతో తాగునీరు కలుషితం అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తాగునీటి అవసరాలకు నీటిని కొనుగోలు చేస్తున్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు ఉన్నప్పటికి తాగునీటి పైపులైన్ల విస్తరణ నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారు. రాయచోటి ప్రాంతంలో రోజుకు అవసరమైన నీరు 1.50 కోట్ల లీటర్లు. రోజుకి సరఫరా అవుతున్న నీరు 80 లక్షల లీటర్లు మాత్రమే. అదేవిధంగా మదనపల్లిలో సరఫరా చేయాల్సిన నీరు 2.25 కోట్లు లీటర్లు. రోజుకు 75 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. పురపాలక సంఘాలు తాగునీటి అవసరాలకు అనుగుణంగా పైప్ లైన్లను విస్తరించడం లేదు. మొదట్లో వేసిన గొట్టాల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కారణంగా డిమాండ్ మేరకు చేయలేకపోతున్నారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way