Logo
Date of Publish : 02 April 2024, 10:04 pm
Editor : Sake Naresh

ప్రజారంజక పాలనే మా లక్ష్యం : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి

     తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 02 (జనస్వరం) : ప్రజారంజక పాలన అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడులో మంగళవారం పల్లెపోరు మూడో రోజు కార్యక్రమంలో బొలిశెట్టికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ తాతాజీతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు విసిగిపోయిన ప్రజలు కూటమి రావాలని కోరుకుంటున్నారని వారి అదృష్టం త్వరలోనే నెరవేరుతుంది అన్నారు. భారీగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అందించిన ప్రజలను సంక్షేమం పేరుతో వంచించిన జగన్ ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com