ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్

ఫార్మా పరిశ్రమ

          పెందుర్తి ( జనస్వరం ) : ఫార్మసిటీలోని కోరి ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ అమరుస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రాజారావు(38) కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంతో పరిశ్రమల్లోని కార్మికులతో పాటు ఫార్మా సమీప గ్రామాల్లోని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు అన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఫార్మాసిటీలోని చాలా పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్న అనధికార కార్యకలాపాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రతిసారి మరణించిన కుటుంబాలకు ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి తరువాత ఆ పరిశ్రమలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ రకమైన ప్రమాదాలకు కారణం అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way