నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన దామరమడుగు జనసైనికులు
నివర్ తుఫాన్ కారణంగా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగు గ్రామంలోని గుంటకట్ట నందు నివాస గృహలోకి వరదనీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్థానిక జనసేనపార్టీ నాయకులు sk. ఇబ్రహీం, sk. గౌస్ భాషా మరియు జనసైనికుల ఆధ్వర్యంలో బియ్యం మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మండల జనసేనపార్టీ కమిటీ సభ్యులు పసుపులేటి సురేష్ గారు, ch. సునీల్ గారు మాట్లాడుతూ పెన్నా నదికి వచ్చిన వరద ప్రకృతి సహజంగా వచ్చినది కాదు, ఇది సోమశిల నిర్వహణ, ఇరిగేషన్ వారి తప్పిదం కారణంగానే వరద వచ్చిందని టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో తుఫాన్ పుట్టుక అది ఎప్పుడు ఎక్కడ తీరం దాటుతుందో దాని ప్రభావంతో ఎంత వర్షపాతం వస్తుందో ఖచ్చితంగా సమాచారం అందుతున సరైన జాగ్రత్తలు తీసుకోకనే పెన్నా పరివాహక ప్రాంతాల్లోని కొన్ని వందల ఎకరాలోని పంటలు నీటమునిగాయి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.