Search
Close this search box.
Search
Close this search box.

రైతులను ముంచేసిన మిచౌంగ్ తుపాను

మిచౌంగ్

    గూడూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని పలు మండలాల్లో మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసి నష్టాలను మిగిల్చిందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు తెలిపారు. చిట్టమూరు మండలంలో వందల ఎకరాల్లో నీట మునిగిన వరి నాట్లును బుధవారం మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో వరి నాట్లు పూర్తిగా మునిగి ఇసుక మేట వేయదంతో రైతన్నలకు తీరని శోకం మిగిల్చిందన్నారు. నష్టపోయిన రైతన్నలనుప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్ట పరిహారం అందచేయాలనీ డిమాండ్ చేసారు. అనంతరం చిట్టమూరు మండలం కొత్తగుంట- కొగిలి గ్రామానికి మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సోమవారం గ్రామస్తులతో కలిసి పరిశీలించిన అయన కొగిలి పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న వంతెన నిర్మాణం జరగలేదని అన్నారు. వర్షాలు, వరదలు వచ్చినా రాకపోకలు ఆగిపోతాయని, 20 ఏళ్లుగా ఈ విషయాన్నీ అధికారులు, రాజకీయ నాయకులకు చెప్పినా కానీ వంతెన నిర్మాణం గురించి స్పందన లేదని గ్రామస్తులు తెలిపారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వంలో కొత్తగుంట- కొగిలి వంతెన ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way