సృష్టికే.. సృష్టికర్తలు మహిళలు అన్నిరంగాల్లో పురోగతి సాధించాలి : పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్ దేశినీడి

   పిఠాపురం, (జనస్వరం) : కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… పాదాభివందనం!! తన కుటుంబం కోసమే కాకుండా నేటి మహిళ సమాజం, దేశం కోసం కూడా తన శక్తి సామర్థ్యాలను పంచుతోంది. మహిళా సాధికారత దేశానికి, సంస్కృతికి గర్వకారణం. అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా మహిళలు ఎదుగుతున్నారు. ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒకచోట తమ కార్తవ్యన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. పుట్టినప్పట్టి నుంచి ప్రాణం పోయే వరకు తానంటేనే సేవ.. అనేలా ప్రతి ఒక్క విషయంలో పురుషులకు తోడు నిలుస్తుంటారు స్త్రీలు. వీటికి ప్రతిఫలంగా తనకంటూ కాస్తంత ప్రేమ… ఓదార్పు.. తోడు మాత్రమే కోరుకుంటుంది. కొంచెం ప్రేమను చూపిస్తే చాలు లెక్కలేనంత సంతోషంతో మునిగిపోతుంది. అలాంటి మహిళలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. స్త్రీ సమానత్వం, సాధికారతలే మన సమాజ ప్రగతికి మూలమని జనసేనపార్టీ ఆవిర్భావ దినం నుంచీ జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్న సిద్ధాంతం. ప్రతి రంగంలోనూ తన సత్తా చాటుతూ సమాజ ప్రగతికి, కుటుంబ సంక్షేమానికి సమానం కంటే ఎక్కువ బాధ్యతను నిర్వర్తిస్తోన్న స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలలో పురోగమిస్తున్న మహిళలందరికీ పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్ దేశినీడి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way