కొత్తపేట, ఫిబ్రవరి 23, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు కార్పొరేషన్ డైరెక్టర్లు వమ్మి బాలాజీ, కేత శ్రీను, పెంకే జగదీష్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, చెప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ, పొలిటికల్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో ఫిబ్రవరి 23న విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్లో నిర్వహించిన కార్పొరేషన్ సమావేశం వివరాలను సమగ్రంగా వివరించారు. కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, సమాజ సంక్షేమానికి చేపడుతున్న చర్యలపై చర్చించారు. అనంతరం రెడ్డి సుబ్రహ్మణ్యం మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారిని శాలువాలతో సత్కరించి కార్పొరేషన్ డైరీని జ్ఞాపికగా అందజేశారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో జరిగింది.
