Search
Close this search box.
Search
Close this search box.

ఆచంటలో జనసైనికుల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం

ఆచంట

         ఆచంట ( జనస్వరం ) : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోడూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులైన బొక్క గణపతి  ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు రావి హరీష్ మాట్లాడుతూ రాజ్యాంగం అనేది ఒక మతానికి పవిత్ర గ్రంథం ఎలాగో అలాగా దేశానికి పవిత్రమైన ఒక గ్రంథం గా దేశంలో పరిపాలన విధానం అలాగే సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం వీటన్నిటిని కలిపి ఒక గ్రంథంలో పొందుపరిచి ఉన్నారని అన్నారు. అదే రాజ్యాంగం అని దాన్ని సక్రంగా అవలంబించే నాయకులు నాయకత్వం ఉన్న రోజునే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం యొక్క ఆశయం నెరవేరుతుందని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు తోలేటి వేణు, పోడూరు టిడిపి గ్రామ నాయకులు దిలీప్ కుమార్, జనసేన పార్టీ నాయకులు కడలి మహేంద్ర, కర్న్ ఆనంద్,  కుడిపూడి నాగరాజు, సేలబోయిన భాను పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way