జనసేన పార్టీ బలోపేతానికి ఎచ్చెర్ల మండలం చిన్నారావు పల్లి గ్రామంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు సమావేశం
ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం చిన్నారావుపల్లి గ్రామంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముందుగా చిన్నారావు పల్లి జనసేన నాయకులతో సమావేశం అయ్యి , గ్రామ స్థాయిలో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలో సూచనలు ఇవ్వడం జరిగింది. తదుపరి నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో సీనియర్ నాయకులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశం లో ముఖ్యమైన విషయాలు :
1.గ్రామస్థాయిలో జనసేన పార్టీ జండా ఆవిష్కరణలు నెలకి ఒక మండలం లో ఒక గ్రామం చొప్పున నాలుగు మండలాల్లో నాలుగు గ్రామాల్లో జెండాను ఎగరవేయడం.
2. స్థానిక మండల కేంద్రాల్లో జనసేన పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం.
3.నాలుగు మండలాల్లో పార్టీని బలోపేతం చేయడం కొరకు తాత్కాలికంగా మండల స్థాయిలో టీం నియమించడం.
4. నియోజకవర్గ స్థాయిలో 9మంది సభ్యులతో ఒక తాత్కాలిక కోర్ టీం నియమించడం.
5.ఏ గ్రామంలో సమస్య వచ్చినా సరే నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల జి. సిగడాం మండల జడ్పిటిసి అభ్యర్థి భూపతి అర్జున్ గారు, ఎచ్చెర్ల మండల జడ్పిటిసి అభ్యర్థి తమ్మినేని శ్రీనివాస్, రణస్థలం మండల నాయకులు చిరంజీవి, రెడ్డి భాస్కర్, రామారావు, షణ్ముఖ. లావేరు మండలం నాయకులు విజయ్ కృష్ణ, రాము, దుర్గ రెడ్డి, గోపాల్, మోహన్. జి.సిగడాం మండల నాయకులు మీసాల రామకృష్ణ, సంతోష్. ఎచ్చెర్ల మండలం నాయకులు మధుబాబు, భవాని శంకర్, కిల్లి నారాయణ. స్థానిక గ్రామ నాయకులు అప్పలనాయుడు, రాము, లక్ష్మణ్ రావు ,వేణు తదితర నాయకులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. నియోకవర్గస్థాయిలో జనసేన బలోపేతం కొరకు తాత్కాలికంగా టీం ఏర్పాటు చెయ్యటం జరిగింది.