Logo
Date of Publish : 07 October 2021, 3:07 pm
Editor : Sake Naresh

రేషన్ కార్డు పింఛన్లు తీసివేతపై గిరిజనుల్లో ఆందోళన : అరకు జనసేన నాయకులు మాదాల శ్రీరాములు

      అరకు ( జనస్వరం ) : జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు పత్రికాముఖంగా మాట్లాడుతూ రేషన్ కార్డు పింఛన్లు తొలగింపు పై గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజల పట్ల గంటకో మాట పూటకో మాటగా గిరిజనుల జీవోల మీద, చట్టాల మీద, కులాల మీద ప్రభుత్వా తీరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఏ క్షణం తొలిగిస్తారో బిక్కు బిక్కుమంటున్న గిరిజనులు ఇప్పటికే నిత్యావసర సరుకుల రేట్లతో సతమతమవుతున్నారు. సర్వేల పేరుతో, జీవోల పేరుతో, భూముల పేరుతో రేషన్ కార్డులు మరియు పింఛన్లు తీసేస్తున్నారు. తొలగించిన ఫించన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతంత మాత్రంగా బతికే గిరిజనులకు చెత్తపన్ను, ఇంటిపన్ను వెంటనే రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వ తీరు మార్చుకోవాలని లేని పక్షాన జనసేనపార్టీ పార్టీ తరుపున భారీ ఉద్యమం చేస్తామని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com