Search
Close this search box.
Search
Close this search box.

రేషన్ కార్డు పింఛన్లు తీసివేతపై గిరిజనుల్లో ఆందోళన : అరకు జనసేన నాయకులు మాదాల శ్రీరాములు

అరకు

      అరకు ( జనస్వరం ) : జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు పత్రికాముఖంగా మాట్లాడుతూ రేషన్ కార్డు పింఛన్లు తొలగింపు పై గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజల పట్ల గంటకో మాట పూటకో మాటగా గిరిజనుల జీవోల మీద, చట్టాల మీద, కులాల మీద ప్రభుత్వా తీరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఏ క్షణం తొలిగిస్తారో బిక్కు బిక్కుమంటున్న గిరిజనులు ఇప్పటికే నిత్యావసర సరుకుల రేట్లతో సతమతమవుతున్నారు. సర్వేల పేరుతో, జీవోల పేరుతో, భూముల పేరుతో రేషన్ కార్డులు మరియు పింఛన్లు తీసేస్తున్నారు. తొలగించిన ఫించన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతంత మాత్రంగా బతికే గిరిజనులకు చెత్తపన్ను, ఇంటిపన్ను వెంటనే రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వ తీరు మార్చుకోవాలని లేని పక్షాన జనసేనపార్టీ పార్టీ తరుపున భారీ ఉద్యమం చేస్తామని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way