నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 50000 వేలు రూపాయలు నష్టపరిహారం అందించాలి – దాచేపల్లి మండల జనసేన నాయకులు

    దాచేపల్లి, (జనస్వరం) : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని తెల్ల తెగులు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వ్యవసాయ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే ఈ ప్రభుత్వానికి కనీసం రైతుల పట్ల వారు పడుతున్న కష్టాలపై కనీస చిత్తశుద్ధి లేదని, ఈ ఏడాది మిర్చి పంట వేసిన నష్టపోయిన మిర్చి రైతుకు ఎకరాకు 50000 నష్టపరిహారం అందించాలి- జనసేన సుమారు 70 శాతం మంది రైతులు నష్టపోయిన వారేనని, మీకు వారిపై ఏమాత్రం చిత్తశుద్ధి కనుక ఉంటే వెంటనే నష్ట పరిహారంగా 50000 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం అందించని పక్షములో రైతు సంఘాలతో కలిసి వ్యవసాయ సంబంధిత కార్యాలయాల ముట్టడికి పిలుపును ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మందపాటి దుర్గారావు, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, తక్కెళ్లపాడు సర్పంచ్ శానం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ, బత్తుల వెంకయ్య, జనసేన నాయకులు తోట నాగేశ్వరరావు, నంబూరి మధు, కోట మధు, గురజాల నరసింహారావు, వేల్పుల చైతన్య, రుద్రాల అంజి జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way