Logo
Date of Publish : 09 January 2023, 3:52 pm
Editor : Sake Naresh

యువశక్తి సభకు అశేషంగా తరలి రండి : కుప్పం నియోజకవర్గ జనసేన నాయకులు

      శాంతిపురం, (జనస్వరం) : మన యువత మన భవిత అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్న యువశక్తి సభకు జన సైనికులు అశేషంగా తరలిరావాలని కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండల జనసేన అధ్యక్షుడు జిఎం కిషోర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మండల జనసైనికులతో కలిసి యువశక్తి కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే యువతకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని అలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు యువత భవిష్యత్తును మార్చేందుకు యువశక్తి కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార ప్రధాన కార్యదర్శి వామనమూర్తి, జిల్లా కార్యదర్శి రామమూర్తి,జిల్లా సమీక్ష కార్యదర్శి నవీన్ కుప్పం నియోజకవర్గం మండల ప్రధాన కార్యదర్శి రవి, శ్రీకాంత్, మండల కమిటీ కార్యదర్శి సంపత్, జన సైనికులు బాలకృష్ణ మోహన్ లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com