Search
Close this search box.
Search
Close this search box.

బటన్ నొక్కుడు సీఎం జగన్ కు జైలు కాపురం తప్పదు

జగన్

       ఏలూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో మైనింగ్, ఇసుక, మద్యం వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, నిజాయితీపరుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గంప గుర్తుగా జనసేన పార్టీని, కాపులను తెలుగుదేశం పార్టీకి అమ్మేశారని, జనసేన పార్టీని తాకట్టు పెట్టారని, దుష్ప్రచారం చేస్తూ, దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని, కుక్కలు, నక్కలు, గాడిదలాంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మొరుగుతున్నారని రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 40 శాతమంది వైసిపి లబ్ధిదారులేనని,బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ పాత్ర ఉందని, సిబిఐ నిర్ధారించడంతో తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి కాళ్ళ వేల పడుతున్న జగన్మోహన్ రెడ్డికి జైలు కాపురం తప్పదన్నారు.. ఏలూరు నియోజకవర్గంలో పనికిమాలిన ఎమ్మెల్యే ఆళ్ల నాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆయనకు ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక లేదని, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష సమావేశాలు పేరుతో మీటింగ్లో ఏర్పాటు చేసి పత్రికల్లో ఫోటోలు కు ఫోజులు ఇవ్వడం తప్పా, 2006లో ఏర్పాటైన కాలనీలకు మౌలిక వసతులు కల్పించడంలోనూ, విలీన గ్రామాలైన కొత్తూరు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ వాసులకు సమస్యలు పరిష్కరించి వారికి మౌలిక వసతులు కల్పించకుండా ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు.. ఈ మీడియా సమావేశంలో జనసేన నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, నాయకులు బోండా రాము నాయుడు,బెజవాడ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way