Search
Close this search box.
Search
Close this search box.

నాసేన కోసం నావంతుగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన సినీఆర్ట్ డైరెక్టర్ సురేష్

     కదిరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ప్రకటించిన నాసేన కోసం –  నావంతు అనే పిలుపునందుకుని కదిరి నియోజకవర్గ నివాసి సినీ ఆర్టి డైరెక్టర్ సాహి సురేష్ లక్ష రూపాయలు జనసేన పార్టీకి, ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వరుణ్, కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ ల సమక్షంలో లక్ష రూపాయల డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించారు. ఈ సందర్భంగా సాహి సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆయన ఆశయాలు సిద్ధాంతాలు, ప్రజల కొరకు ఆయన పడుతున్న తపన నచ్చి నాసేన కోసం నావంతు కార్యక్రమంలో నేను భాగస్వామినయ్యానని తెలియజేశారు. విరాళం ఇచ్చిన సాహిసురేష్ ను మధుసూదన్ రెడ్డి, వరుణ్, భైరవ ప్రసాద్ లు సన్మానించి అభినందనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ నాసేన కోసం –  నావంతుకు పది రూపాయల పైన ఎంతైనా ఫోన్ పే ద్వారా పంపి ఎక్కువమందిని భాగస్వాములు కావాలని ఆ విధంగా పార్టీ నాది, మనది అనే భావన కలుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్తామని దానికి కమిటీలు కూడా వేస్తామని, ఆవిధంగా ప్రతి గ్రామములో జనసేనపార్టీ కార్యకర్తలు ఉండేలా కృషి చేస్తామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way