Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యముతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం అందించిన చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత

చిత్తూరు

    మదనపల్లి, (జనస్వరం) :  చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండలము వేపూరుకోట పంచాయితీ RS కొత్తపల్లిలో నివాసం వుండే లేట్ కృష్ణమూర్తి భార్య రమాదేవి గారికి ఇటీవల ఆరోగ్యం బాగలేక డాక్టర్లు కాలు తీసివేసారు. భర్త 10 సంవత్సరాల క్రితం చనిపోయారు. వీరి కుమారుడు కిరణ్ పుట్టుకతోనే అంగవైకల్యుడు కావడంతో రమాదేవి గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈమె పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారు, తంబళ్లపల్లె నాయకులు, కార్యకర్తలు స్వయంగా వెళ్లి బాధితురాలిని పరామర్శించి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పి ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపు లేటి హరిప్రసాద్  గారి దృష్టికి తీసుకువెళ్లి తనకు, తన కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారు, తంబళ్లపల్లె, కటాగోల్ల పల్లె జనసేన నాయకులు భరత్, రమేష్, బాబు, శంకర్,హితేశ్, సుధాకర్,ఈశ్వర్, నరేష్, సంతోష్, అనిల్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way