వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

   చిత్తూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరదబాధితుల సహాయార్థం జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పంపిన నిత్యావసర సరుకుల కిట్లను చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, శ్రీ దేవర మనోహర గారి నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో రాయలచెరువు ఎగువ ప్రాంతాలలో 90 శాతం మునిగిన సి.కె పల్లి పంచాయతీలోని సూరావారిపల్లి, రెడ్డివారిపల్లి గ్రామాల వరద బాధితుల సహాయార్థం 80 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్య్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి గారు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధు గారు, జిల్లా కార్యదర్శులు కలప రవి గారు,హేమ కుమార్ గారు, కీర్తన గారు, మరియు దండు లక్ష్మీపతి రాయల్, పగడాల యువరాజ్, జస్వంత్, ముండ్లపాటి మురళి, కిరణ్, రవిప్రకాష్, రెడప్ప, సంజీవి హరి తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way