Logo
Date of Publish : 01 April 2022, 4:10 pm
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం

           చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం మరియు వివిధ నియోజకవర్గాల ఇంచార్జులుతో కలసి చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసనా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు జనసేన ఉద్యమం తగ్గేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చేతితో సహాయం చేసి, ఇంకో చేత్తో ప్రజల నుంచి పన్నుల రూపంలో దోచుకునే ముఖ్యమంత్రి గద్దె దిగడం ఖాయమని, ప్రజలే ఓడించే రోజులు దగ్గరలో ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రం రావణకాష్టం అయిందని, భారంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు సుఖంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాలు అయినా సరే అభివృద్ధిలో మాత్రం శూన్యమని, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే గడియలు ఆసన్నమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com