Search
Close this search box.
Search
Close this search box.

వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు

     వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటులు, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి మనవసేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సాయి మారుతి ధ్యాన మందిరంలో జనసేన పార్టీ నాయకులు, మెగాస్టార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా నిర్వాహకులు ఉదయాన్నే చిరంజీవి పేరిట గోత్రనామాలతో శ్రీ ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమాని, చిరంజీవి మనవసేవా సంఘం అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు బి.పి.నాయుడు కేక్ కట్ చేసి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ చిరంజీవి స్వయంకృషితో ఎవ్వరి సహకారం లేకుండా సినీపరిశ్రమలో కష్టపడి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన మహానుభావుడని, సమాజం మనకి ఏమిచ్చిందని కాకుండా సమాజానికి మనమేమి చేసాం అనే ధోరణిలో గొప్ప ఆలోచనచేసి, తమ అభిమానులను సైతం సేవామార్గంలో నడిపించే గొప్ప మనసున్న మగమహారాజు అని, అందుకే చిరంజీవి భారతదేశమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నటుడు చిరంజీవి అని అన్నారు. మరో విశిష్ట అతిధిగా హాజరైన జనసేనపార్టీ నాయకులు జనసేన జాని మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను సేవారూపంలో ప్రజల్లోకి తీసుకెల్తూ సమాజాసేవలో మెగాఫ్యామిలీ అభిమానులే ముందున్నారని అంటూ మెగాభిమానులు చేసే సేవలను కొనియాడుతూ ఇంతగొప్ప సేవామూర్తి చిరంజీవికి భారతరత్న ఇచ్చి ఆయన్ను గౌరవించిన నాడే తనసేవలకు సార్ధకత అని అన్నారు. అనంతరం చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా వృద్ధులకు పళ్ళు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యులు మత్స పుండరీకం, కంటు మురళి, మత్స.కృష్ణా రావు, వాన కైలాష్, చిన్ని, కర్నేన సాయి పవన్, కోడి వెంకటరావు నాయుడు, అభిమానులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way