టీం పిడికిలి పోస్టర్స్ ను విడుదల చేసిన చీపురుపల్లి జనసేన నాయకులు

     చీపురుపల్లి ( జనస్వరం ) :  చీపురుపల్లి నియోజకవర్గంలో టీం పిడికిలి వారు రూపొందించిన పోస్టర్స్ ఆవిష్కరించిన జనసేన నాయకులు. ఇక తగ్గేదిలే! యుద్ధం మీరు మొదలు పెట్టారు… మేము ముగిస్తాం!!! రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంత వరకు తగ్గుతూ వెళ్లాం… ఇంకా అవతలి వాళ్ళు తగ్గాలి…! జనసేనకు అధికారం ఇవ్వాలి…! జనసేనాని పవన్ కళ్యాణ్ గారు! అంటూ టాగ్ లైన్ ఉన్న పోస్టర్స్ ను ఆటోలకు అంటించారు. వారు  మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేశ్, బోడ సింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్,గొర్లె చిన్నం నాయుడు, యేసు, రామకృష్ణ, ముల్లు జగదీష్, ఎచ్చర్ల లక్ష్మీ నాయుడు, కుమార్, జగదీష్,శంకర్, విసినిగిరి శ్రీను, బాలకృష్ణ, కృష్ణ, రమన, శ్రీను,అప్పలనాయుడు, కిరణ్ పైడి తల్లి, నాయుడు,వీరమహిళ క్రిష్ణ వేణి* తదితర జన సైనికులు నాయకులు పాల్గొన్నారు.