మహంకాళీ అమ్మవారి నూతన ఆలయనిర్మాణం కొరకు లక్ష రూపాయలు విరాళమిచ్చిన చిన్ని వెంకట మల్లిఖార్జునరావు కుటుంబ సభ్యులు
నరసరావుపేట,జూలై 12( జనస్వరం)
ఇస్సపాలెం గ్రామం లోని శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం కొరకు నరసరావుపేట వాస్తవ్యులు చిన్ని వెంకట మల్లికార్జునరావు ధర్మపత్ని శ్రీదేవి కుమారుడు ప్రసన్న కుమార్ ధర్మపత్ని ఉమామహేశ్వరి ల కుమారుడు హేమసాయి బాలాజీ,లక్కీ బాల ఈశ్వర్, శక్తిధర్మ జయ సహస్ర,సాయి శ్రీ సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ వారు 1,03,100/వినగదు ని దేవాదాయ శాఖ అధికారిణి నలబోతు మాధవిదేవికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్ మరియి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.