Search
Close this search box.
Search
Close this search box.

కూకట్ పల్లి జనసేన పార్టీ ఆఫీస్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి

       కూకట్ పల్లి, ఏప్రిల్ 03 (జనస్వరం) : ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని KPHB 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 3 న, మరాఠా యోధుడు రాజు యుద్ధభూమిలో శౌర్యసాహసాలకు గుర్తుగా జరుపుకుంటారు అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నైపుణ్యం కలిగిన నాయకుడు మరియు వీర యోధుడు. అతను గెరిల్లా యుద్ధంలో నిపుణుడు మరియు రహస్య సైనిక కార్యకలాపాలను ప్లాన్ చేశాడు అని, అతని రహస్య యుద్ధం కారణంగా అతన్ని తరచుగా “పర్వత ఎలుక” అని పిలుస్తారు అని అన్నారు. శివాజీ మహారాజ్‌కి రామాయణం మరియు మహాభారతం గురించి చాలా తెలుసు మరియు ఆసక్తిగల పాఠకుడు, అతను ఎటువంటి అధికారిక పాఠశాల విద్యకు హాజరు కాలేదు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, కలిగినేడి ప్రసాద్, షణ్ముఖ, పసుపులేటి ప్రసాద్, అన్నపరెడ్డి వెంకటస్వామి, పులగం సుబ్బు, రామరాజు, దామోదర్, మధుసూదన్ రెడ్డి, ఎర్ర రఘు, నాగబాబు, దుర్గా ప్రసాద్, సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way