రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యల గురించి ఎం‌పి‌డి‌ఓ గారికి వినతి పత్రం అందించిన చెన్నేకొత్తపల్లి జనసేన నాయకులు

చెన్నేకొత్తపల్లి

          రాప్తాడు ( జనస్వరం ) : చెన్నేకొత్తపల్లి గ్రామంలోని బిసీ కాలనీలో సిసి రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక జనసేన నాయకులు ఇటికోటి క్రాంతి కుమార్ అన్నారు. మట్టి రోడ్లు మొత్తం గుంతలు పడి వర్షాలు వచ్చినపుడు నీళ్లు నిలువ ఉంటున్నాయి. మురికి నీళ్ల కాలువలు కూడా లేక నీళ్లు మొత్తం దారిలోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు వినతిపత్రానికి జతచేసి ఎం‌పి‌డి‌ఓ కు అందించడం జరిగింది. క్రాంతి కుమార్ మాట్లాడుతూ బిసీ కాలనీలో సిసి రోడ్లు మరియు మురికి కాలువలు వేయించి ప్రజల సమస్యను వీలైనంత త్వరగా తీర్చవలసిందిగా కోరామన్నారు. సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చూపని ఎడల ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ వారి దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way