Search
Close this search box.
Search
Close this search box.

కెమికల్ కంపెనీలు విషపూరితమైన కెమికల్ వాటర్ ను డ్రైనేజీలోకి వదులుతున్నారు

    నెల్లిమర్ల ( జనస్వరం ) : కందివలస గెడ్డని అనుకోని వున్నా కెమికల్ కంపెనీలు గ్రీన్ టేక్, శేషాసాయి, మరియు ఆంధ్రఆర్గానిక్, గెడ్డలోకి ఎఫెలెంట్రీట్మెంట్ చెయ్యకుండా విషపూరితమైన కెమికల్ వాటర్ పైడిభీమవరం డ్రైనేజీ కాలువ ద్వారా బ్రిడ్జిఏరియా గెడ్డలోకి విడుదల చేస్తున్నారని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ లోకం మాధవి అన్నారు. ఆమె మాట్లాడుతూ సదరు పరిశ్రమ యాజమాన్యం వారికీ గ్రామస్తులు పశువులు మారియి చేపలు చనిపోతున్నాయని, అలాగే పశువులు గర్భసాయం పోయి నష్ట పోతున్నారు. పశువులు డాక్టర్ కి చూపిస్తే వాటర్ ప్రాబ్లెమ్ అనీ చెప్పుచున్నారు. అందరూ ఎన్నిసార్లు మోరపెట్టుకున్న వరుమాత్రం ఎదవిధిగా గెడ్డల్లోకి కెమికల్ వాటర్ విడుదలా చేస్తున్నారు. ఇప్పటికే గెడ్డని అక్రమంగా రోడ్డువేసి కొన్ని కెమికల్ కంపెనీలా పైపులైన్ కప్పివేసి ఆ పైప్ లైన్స్ కుడా డెమేజ్ అయి గ్రౌండ్ వాటర్ 12 కిలోమీటర్లు మేర కలిసితం అయి ప్రజలు అనారోగ్యంనికి గురియ్యి కీళ్ల నొప్పులు, కిడ్నీ మరియు చర్మవ్యాధులు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ మరియు ప్రభుత్వం ఎవరు మా గ్రామాలను పట్టించు కోవడం లేదని వాపోయారు. ఇంత కాలుష్యం భరిస్తూన్నా అల్లాడిపాలెం గ్రామలకి ఉపాధి అవకాశం కూడా చాలా మందికి లేదు. అరబిందో మరియు శ్రేయాస్ పరిశ్రమలు హైకోర్టు నోటీస్ వున్నా అక్రమ నిర్మాణరోడ్డు వాడుకొని కోర్ట్ ఆర్డర్ దిక్కరిస్తూ వారి పనులు వారు యథావిధిగా చేస్తున్నారు. ఈ విషయం తెలుకొని జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం లోకం మాధవి  స్పందించి అల్లాడు పాలెం గ్రామానికి విచ్చేసి సమస్య పరిస్కారం అయ్యే వరకు పోరాడతామని  గ్రామ ప్రజలకు చెప్పారు  గ్రామంలో జనవాసాలా మధ్యలో పెట్టిన వైన్ షాప్  వలన మాకు చాలా సమస్యలు కలుగుతున్నాయని గ్రామ ప్రజలు తెలియజేసారు. దీనిపై లోకం మాధవి స్పందించి కలెక్టర్ కి తెలిపి షాపు తొలగించేవరకూ గ్రామస్తులకి అండగా ఉంటామని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way