రైల్వేకోడూరు పట్టణములో స్థానిక మిషనరీ స్కూల్ ( బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా) వద్దగల కోవిడ్ టెస్టింగ్ కేంద్రాన్ని మరో చోటికి మార్చాలని జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు పేర్కొన్నారు. స్థానిక పాఠశాల చుట్టూ బ్యాంకులు, టిఫిన్ సెంటర్లు, వ్యాపారాలు, జన సమూహం రద్దీ కారణంగా కోవిడ్ టెస్టింగ్ వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్నారు. వ్యాక్సిన్ సెంటర్ గా మార్చగలిగితే ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. కోవిడ్ టెస్టింగ్ సెంటర్ వలన చుట్టుపక్కల వారికి సరైన జాగ్రత్త లేని కారణంగా వైరస్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రభావం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల శాంపిల్స్ తీసిన వ్యర్ధాలు వలన ప్రజలకు ప్రమాదముందన్నారు. బహిరంగ ప్రాంతంలో జరిగే ఈ పరీక్షలు జన సమూహానికి దూరంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, వైద్య అధికారులు తక్షణమే స్పందించి కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ని దయచేసి మార్చమని ఈ సందర్భంగా కోరారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com