ప్రజల సమస్యలు ఎక్కడ వున్నా అక్కడ జనసేన వుంటుందని మరోసారి రుజువు చేసిన చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీలో సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు ఇతనికి వికలాంగుల కోటా కింద పెన్షన్ తీసుకుంటూ వున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా బాధితుడు వెంకటేశ్వర్లు కి పెన్షన్ ఇవ్వడము లేదని తెలిసిన వెంటనే జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు, విశ్రాంతి పోలీసు అధికారి కృష్ణయ్య గారు, ముండ్లపాటి మురళి, కొత్తూరు గిరీష్, భార్గవ్ లు నెరబైలు సచివాలయం కి వెళ్లి అక్కడ వాలంటీర్ పచ్చార్ల భాస్కర్ ని ప్రశ్నించారు. వెంకటేశ్వర్లు తిరుపతి లో ఉన్నందున 3 నెలలు పెన్షన్ తీసుకోనందున తొలగించబడినదని, మళ్ళీ పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోగా ఆగష్టు నెల నుండి వెంకటేశ్వర్లుకు పెన్షన్ మంజూరు కాబడినది అని ఈరోజు ఆగష్టు నెల 3000 మరియు సెప్టెంబర్ నెల 3000 కలిపి 6000 రూపాయలు వెంకటేశ్వరులకి అందించామని తెలిపారు. అయితే బాధితుడు దగ్గరనుండి పూర్తి వివరాలు సేకరించాలని అన్నారు.