మరణించి కుటుంబాలకి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్

మరణించి కుటుంబాలకి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్

              కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం 7 వ మైలు వద్ద సెప్టెంబర్‌ ఒకటో తేదీన జరిగిన కరెంట్‌ షాక్‌ దుర్దటనలో అశువులు బాసిన జనసైనికులు రాజేంద్ర, సోమశేఖర్‌, అరుణాచలం కుటుంబ సభ్యులను జనసేనాని శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి పిలుపుతో, ఆయన స్పూర్తితో, జనసేన నాయకులు మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 13 లక్షల 25 వేలు, గాయపడిన ఒకొక్క కుటుంబానికి 1 లక్ష 5 వేలు ఇవ్వడం జరిగింది. జనసేనాని జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి అదేశాల మేరకు మెగా ఫ్యామిలీ హీరోలు రాంచరణ్ గారు, అల్లు అర్జున్ గారు, సినీ నిర్మాతలు దిల్ రాజు గారు, ఏఎం రత్నం గారు, మైత్రీ మూవీస్ రవి గారితో పాటు జనసేన పార్టీ ఎన్.ఆర్.ఐ వింగ్ వారందరు కలసి పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు బ్యానర్ లు కడుతూ మృతి చెందిన కుటుంబాలకి ప్రకటించిన ఆర్ధిక సహాయం చెక్కులను మృతుల కుటుంబాలకు అందజేసిన జనసేన నాయకులు. జనసైనికులు మరియు కళ్యాణ్‌ గారి అభిమానుల మధ్యన ఆర్థిక సహాయం చేసి మృతుల సమాధుల వద్ద ఘననివాళులు అర్పించి, క్షతగాత్రులైన అరుణ్‌, సంతోష్ ను కలసి పరామర్శించి, దుర్దటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన రాష్ట్ర నాయకులు జనసేన PAC సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్ గారు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, చిలకం మధుసూదన్ గారు, సురేష్ గారు కుప్పం ఇంచార్జి డా.వెంకట రమణ గారు, తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ గారు, చంద్రగిరి జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు, గంగాధర నెల్లూరు ఇంచార్జి పొన్న యుగంధర్ గారు, జనసేన నాయకులు రాజా రెడ్డి గారు, బాబ్జి గారు, రాజేష్ గారు హాజరయ్యారు.