
చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులు దేవర మనోహర రైతు నిరసన దీక్ష
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన నాయకులు దేవర మనోహర అధ్యక్షతన రైతు నిరసన దీక్షలు ఘనంగా ప్రారంభమయినాయి . ఈ సందర్భంగా నాయకులు దేవర మనోహర మాట్లాడుతూ రైతే రాజు, రైతే దేశానికీ వెన్నుముక అనే మాటలు కేవలం సామెతలుగానే మిగిలిపోయాయి, కరోనా కష్టకాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన, రైతు బాధ్యతగా ఆరుగాలం కష్టించి పండించిన పంట నివర్ తుపాను కారణముగా నీటిపాలు అయినది. దేశానికి వెన్నెముకగా నిలిచి అన్నం పెట్టిన రైతు నివర్ తుపాను కారణంగా వెన్నుముక విరిగి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకి తక్షణ సాయంగా ఎకరాకు 10,000 వేల రూపాయలు, పూర్తి సాయంగా 35,000 వేల రూపాయలు రైతులకి నష్ట పరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని నియోజక వర్గ రెవిన్యూ అధికారులకు వినతి పత్రం అందజేసి, జనసేన పార్టీ చంద్రగిరి నియోజక వర్గం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ దీక్షలో సహాయ సహకారాలు అందించిన జనసేన మండల నాయకులకు, రైతులకు, జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.